Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం, తరోడ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో, స్థానికులు గుర్తించే సమయానికి నష్టం భారీగా జరిగింది. గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read: తీవ్ర విషాదం.. పెళ్లి చూపుల మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారి పూర్తి వివరాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.