E-Paper
Advertisement

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి
Advertisement

Odisha Ganjam Road Accident: ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ప్రయాణికలతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టి.. ఆ పక్కనే ఉన్న టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భంజన్ జాగర్ నుంచి బెర్హంపూర్ కు 50 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. మార్గం మధ్యలో సంబర్ జోల్ లోని కంజూరు చౌరస్తా సమీపంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీ కొట్టింది. ముందు ఉన్న ట్రక్కును ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించిన ట్యాంకర్ డ్రైవర్.. వాహనంపై పట్టు కోల్పోవడంతో.. అది టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది.

Advertisement

Also Read: బీహార్‌లో ఆర్‌జేడీ నేత దారుణ హత్య

ఆ సమయంలో అక్కడ టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు ట్యాంకర్ చక్రాల కిందపడి మరణించారు. మరో ఇద్దరు కూడా ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు తీవ్రంగా గాయపడగా.. వారిని MKCG మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×