BigTV English
Advertisement

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి

Odisha Ganjam Road Accident: ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ప్రయాణికలతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టి.. ఆ పక్కనే ఉన్న టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.


ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భంజన్ జాగర్ నుంచి బెర్హంపూర్ కు 50 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. మార్గం మధ్యలో సంబర్ జోల్ లోని కంజూరు చౌరస్తా సమీపంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీ కొట్టింది. ముందు ఉన్న ట్రక్కును ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించిన ట్యాంకర్ డ్రైవర్.. వాహనంపై పట్టు కోల్పోవడంతో.. అది టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది.

Also Read: బీహార్‌లో ఆర్‌జేడీ నేత దారుణ హత్య


ఆ సమయంలో అక్కడ టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు ట్యాంకర్ చక్రాల కిందపడి మరణించారు. మరో ఇద్దరు కూడా ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు తీవ్రంగా గాయపడగా.. వారిని MKCG మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×