Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిరేహాల్ మండలం జాజరకల్లు టోల్ ప్లాజా సమీపంలో ఆయిల్ ట్యాంకర్, లారీ బలంగా ఢీకొన్నాయి. పెద్ద ఎత్తుల మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పోలీసులు చెబుతుంటారు. పదే పదే రోడ్లకు ఇరువైపులా తాటికాయంత అక్షరాలతో హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. అయినా వాహనదారులు అవేమీ పట్టించుకోరు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. హీరేహల్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను.. వేగంగా వస్తున్న మరొక లారీ ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఆయిల్ ట్యాంకర్- లారీ ఢీ కొని, ఒకరు సజీవ దహనం
రెండు లారీల్లోనూ మంటలు చెలరేగడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపు లారీ డ్రైవర్ మంటల్లో సజీవ దహనమయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈలోగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ALSO READ: ఫోన్లో చిన్న బిర్యానీ గొడవ.. కట్ చేస్తే కొడుకు కళ్లెదుటే తల్లిదండ్రులు