Road Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తి సమాచారంలోకి వెళితే.. అయితే రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక మినీ లారీని వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కూడా ముందరి ప్రైవేట్ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. వరుసగా మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వాహనాల ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Also Read: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో సంచలనం.. 600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్!
గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం, తెల్లవారుజామున ఉండే మంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
వెనుక నుంచి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీబస్సు
మార్కాపురం నియోజకవర్గం కొనకమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో ఒకరు మృతి, 12 మందికి గాయాలు pic.twitter.com/YLaTvXItu2
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026