Pune Accident: మహారాష్ట్రలోని పూణే సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ఆరు వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..
పూణే సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన
అదుపుతప్పి ఆరు వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు
ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో చెలరేగిన మంటలు
ఈ ఘటనలో 8 మంది మృతి.. పలువురికి గాయాలు
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మృతులు పెరిగే అవకాశం ఉందంటున్న… pic.twitter.com/L9PP5VkOas
— ChotaNews App (@ChotaNewsApp) November 13, 2025