E-Paper
Advertisement

Bapatla Crime: ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్.. ఆపై ప్రమాదానికి గురైన కారు, నలుగురు మృతి

Bapatla Crime: ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్.. ఆపై ప్రమాదానికి గురైన కారు, నలుగురు మృతి
Advertisement

Bapatla Crime: అతివేగం ప్రమాదకరం.. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బాపట్ల జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఆదివారం అర్థరాత్రి ధాటిన తర్వాత బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్లపాలెం మండలం సత్యవతిపేట ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీ కొన్నాయి. ఘటన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో నలుగురు మృతి చెందారు. మృతులు కర్లపాలెం ప్రాంతానికి చెందిన బలరామరాజు, లక్ష్మి, పుష్పవతి, శ్రీనివాసరాజు‌గా గుర్తించారు.

మరో ఇద్దరుకి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరు బాలురులు. వారిలో ఒకరికి 13 ఏళ్లు , మరొకరికి 11 ఏళ్లు ఉంటాయి. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను బాపట్ల‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు వ్యక్తులు మరణించారు. గాయపడినవారిని చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది.

Advertisement

ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా

కాకపోతే ఒకర్ని చీరాల, మరొకర్ని గుంటూరు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు.  మృతులు ఎక్కడివారు? ఎక్కడికి వెళ్తున్నారు? బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కొడుకు సంగీత్‌ ఫంక్షన్‌కు వెళ్లారు. వారంతా నరేంద్రవర్మకు దగ్గర బంధువులుగా చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ALSO READ:  ఒకటో తరగతి విద్యార్థిపై ముగ్గురు టీచర్ల దాష్టీకం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన కారణంగా ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు పోలీసులు. మృతులంతా ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే సదరు ఎమ్మెల్యే ఇంట విషాదం నెలకొంది. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×