E-Paper
Advertisement

Mypadu Beach: నెల్లూరులో తీవ్ర విషాదం.. మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

Mypadu Beach: నెల్లూరులో తీవ్ర విషాదం.. మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Advertisement

Mypadu Beach: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిను ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులు హుమాయూన్‌, ఆదిల్‌, తజీమ్ మైపాడు బీచ్ లో స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో గజ ఈతగాళ్లు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా ఉందని, అందువల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై నాగార్జున రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించారు.

మైపాడు బీచ్ లో విషాదం

ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. కెరటాలను అంచనా వేయలేక సముద్రంలో గల్లంతయ్యారు. వీరు నెల్లూరులోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Also Read: Madhya Pradesh: నిశ్చితార్థానికి ముందు.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్

విద్యార్థుల గల్లంతు విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. బీచ్‌లో గల్లంతై మరణించిన ముగ్గురు విద్యార్థుల వివరాలను పోలీసులు గుర్తించారు. పఠాన్ మహమ్మద్ తజీమ్ నారాయణరెడ్డిపేట గ్రామానికి చెందినవాడు. రెండో విద్యార్థి పఠాన్ హుమాయున్ ఇతడు నయాబ్ రసూల్ కుమారుడు, ఈ అబ్బాయి నెల్లూరు నగరంలోని కోటమిట్ట నివాసి అని పోలీసులు తెలిపారు. మూడో విద్యార్థి ఆదిల్ కోటమిట్ట నివాసి. ఈ ముగ్గురూ కలిసి ఆదివారం సరదాగా ఈత కోసం మైపాడు బీచ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×