BigTV English
Advertisement

Rajasthan Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

Rajasthan Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలో టెంపో ట్రావెలర్, ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ఈ ప్రమాదంపై పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ పాస్వాన్ మాట్లాడుతూ.. “ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 18 మంది మరణించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం తరలించడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం” అని అన్నారు.

సీఎం దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఫలోడిలోని మటోడా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం, హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులకు సూచనలు ఇచ్చాను. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.


Related News

Dalit Child Abuse: 1వ తరగతి చదువుతున్న బాలుడిపై ముగ్గురు టీచర్ల దాష్టీకం.. ప్యాంటులో తేలు పెట్టి

Mypadu Beach: నెల్లూరులో తీవ్ర విషాదం.. మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

Cyber Fraud: యూట్యూబర్ హర్ష సాయి పేరుతో ఘరానా మోసం.. జగిత్యాల యువకుడికి సైబర్ వల… రూ. 87,000 స్వాహా!

Madhya Pradesh: నిశ్చితార్థానికి ముందు.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్

Bengaluru Crime: అంబులెన్స్ బీభత్సం.. ముగ్గురు మృతి, వాహనాన్ని ఎత్తి పడేసిన స్థానికులు, వీడియో వైరల్

Vikarabad Murder Case: వద్దు డాడీ అన్నా వినలేదు.. నా కళ్ల ముందే నరికేశాడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలిక వీడియో

Madhya Pradesh Crime: భర్త ప్రైవేటు పార్ట్స్‌పై దాడి, 28 రోజుల బేబీ గొంతు కోసింది, అసలే మేటరేంటి?

Big Stories

×