E-Paper
Advertisement

Rajasthan Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

Rajasthan Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
Advertisement

Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలో టెంపో ట్రావెలర్, ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ పాస్వాన్ మాట్లాడుతూ.. “ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 18 మంది మరణించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం తరలించడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం” అని అన్నారు.

సీఎం దిగ్భ్రాంతి

Advertisement

ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఫలోడిలోని మటోడా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం, హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులకు సూచనలు ఇచ్చాను. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×