Kurnool Road Accident: నేడు మరో రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఐదుగురు మృతి.. ఈ సంవత్సరం చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూల్ బస్సు కాలిపోయిన ఘటన, చేవెళ్ల బస్సు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు, కారు, బైకుల ప్రమాదాలు ఇలా అనేకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కర్ణాటకకు చెందిన ఓ కారు ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా కోటేకల్ కొండ మలుపు వద్ద ఆదోని నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాకుండా డ్రైవర్, ఓ వృద్ధురాలికి గాయాలు కాగా ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు బాడీలు కారులో ఇరుక్కోగా.. క్రేన్ తెప్పించి బయటి తీస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.