E-Paper
Advertisement

Prakasham District: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. డీసీఎం దగ్ధం, డ్రైవర్ సజీవ దహనం

Prakasham District: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. డీసీఎం దగ్ధం, డ్రైవర్ సజీవ దహనం
Advertisement

Prakasham District: ప్రకాశం జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యారు. డ్రై ఫ్రూట్స్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ దారుణం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి అనంతపురం వైపు డ్రై ఫ్రూట్స్‌ను తరలిస్తున్న డీసీఎం వాహనం.. ప్రకాశం జిల్లా రంగారెడ్డిపల్లి సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement

మంటలు భారీగా వ్యాపించడంతో డ్రైవర్ వెర్రిస్వామి వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, వాహనంలో ఉన్న మరో వ్యక్తి జయరామరెడ్డి తీవ్ర గాయాలతో బయటపడగా, స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Also Read: నూతన సంవత్సర కానుక.. నేడే ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 

Advertisement

రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, ఇదే ప్రాంతంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×