Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నవ్ జిల్లాలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
జమల్దిపూర్ గ్రామ సమీపంలోని హర్దోయ్-ఉన్నవ్ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
Also Read: ఏడాది క్రితం మిస్సైన మోడల్ డెడ్ బాడీ లభ్యం.. అసలేం జరిగింది ?
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.