BigTV English

Road Accident : పండుగ వేళ విషాదం.. రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

Road Accident : పండుగ వేళ విషాదం.. రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

Road Accident : పండుగవేళ ఎంతో ఆనందంగా ఉండాల్సిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులను రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో.. బంధువుల రోదనలు మిన్నంటాయి. తమిళనాడులో జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. తిరువణ్ణామలై జిల్లా సెంగం పక్రిపాళయం బైపాస్ రోడ్డు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. అతివేగంతో దూసుకొచ్చిన సుమో బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి, బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సుమో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×