E-Paper
Advertisement

Anantapur Incident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Anantapur Incident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Advertisement

Anantapur Incident: అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు, రోజూలాగే తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు బయలుదేరింది. బస్సు పుట్లూరు నుంచి చింతకుంట గ్రామానికి సమీపిస్తున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణంలో ఉండగానే ఒక్కసారిగా బస్సు ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమయ్యారు. ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, క్షణాల్లో బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులో ఉన్న విద్యార్థులను ఏమాత్రం కంగారు పడకుండా కిందకు దింపి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. విద్యార్థులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి ఉగ్రరూపం దాల్చాయి.

Advertisement

స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అక్కడి వారు పేర్కొంటున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Also Read: నెయ్యిలో జంతు కొవ్వు కలిపారా? లేదా? తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్

Advertisement

ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల యాజమాన్యం బస్సుల నిర్వహణలో (Maintenance) సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిట్‌నెస్ లేని వాహనాల వల్ల విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×