Ammonia Leak: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలో ఉన్న ఓ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో అక్కడి ప్రాతం మంతా ఓక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మరో 60 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరవళ్లూరులో ఉన్నటువంటి ఓ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రొయ్యల ప్లాంట్లొ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో దానిని పీల్చు కొని ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరియు ఫ్యాక్టరీలోని మరో 60 మందికి పైగా కార్మికులు గ్యాస్ పీల్యుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరిని అక్కడి అధికారులు హుటా హుడిన ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని కూడా పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also read: రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్లో అదిరిపోయే సౌండ్ గురూ!
ప్రయాదం జరిగిన ప్రదేశంలో అక్కడి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో సాదారణంగా రొయ్యలను నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ చల్లటి ప్రదేశం విభాగంలో కూలింగ్ కోసం అమ్మోనియా గ్యాస్ను వాడుతారు. దీంతో రోజులాగే ప్లాంట్లో కార్మికులందరు కలిసి పనుల్లో మునిగిపోయారు. దీంతో అదే సమయంలో వారున్న ప్రాంతంలో ఒక్కసారిగా శబ్ధంతో అమ్మోనియా గ్యాస్ పైప్లైన్ లీక్ అయింది. దీంతో కొద్ది సమయంలోనే అక్కడున్న కార్మికుల వద్ద ఫ్యాక్టరీ మోత్తం ఓక్కసారిగా దట్టమైన పొగతో కమ్ముకుంది. దీంతో అందులో చిక్కుకున్న కార్మికులు అమ్మోనియా వాయువును పీల్చుకోండంతో 7 గురు మృతి చెందడంతో పాటు మరో 60 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళల మృతి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న ఓ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో అది పీల్చి ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు… pic.twitter.com/4d6BohHaij
— BIG TV Breaking News (@bigtvtelugu) June 21, 2026
Also read: ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతులు ఏ దేశంలో ఉంటారు? నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే