E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయపురు జిల్లాలో మునగులి సమీపంలో కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా జోగులాంబ గద్వాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టీ. భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న పాటు డ్రైవర్ శివప్ప, బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. టీ. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భాస్కర్ కెనెరా బ్యాంక్ లో పని చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి గద్వాలలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Skywalk: హైదరాబాద్‌లో అత్యద్భుతంగా మరో స్కైవాక్.. త్వరలోనే ప్రారంభం.. ఎక్కడో తెల్సా..?

 

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×