E-Paper
Advertisement

Eluru Dist: గోదావరి వరదలో.. గుండెపోటుతో వ్యక్తి మృతి

Eluru Dist: గోదావరి వరదలో.. గుండెపోటుతో వ్యక్తి మృతి
Advertisement

Eluru Dist: చుట్టూ గోదావరి వరద. బయటకు వెళ్లాలంటే మేళ్లవాగు వంతెన ఒక్కటే మార్గం. కానీ ఆ వంతెన కూడా వరదలో నీటమునిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వ్యక్తికి గుండెనొప్పి వచ్చింది. స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లే మార్గంలో మృతిచెందాడు.

వరద నీటిలో గుండెపోటుతో వ్యక్తి మతి..
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లుకు ఆదివారం మధ్యాహ్నం గుండెనొప్పి రావడంతో ఇంట్లో అందుబాటులో ఉన్న గ్యాస్ ట్యాబ్లెట్‌ వేసుకున్నాడు. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు.

Advertisement

ఎత్తుకుని ఒడ్డుకు చేర్చిన స్థానికులు..
ట్రీట్‌మెంట్‌ కోసం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా.. ఆ ఊరిని గోదావరి వరద చుట్టు ముట్టింది. అయినప్పటికీ బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి, థర్మాకోల్ షీట్పై పడుకోబెట్టి వరద దాటించి, కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు. కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు. అంబులెన్స్ రాకపోవడంతో టూవీలర్‌పై కూర్చోబెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని బుర్రతోగు వరకు వెళ్లారు. అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Also Read: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Advertisement

హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే.. వెంకటేశ్వర్లు మృతి..
అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. మేళ్లవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగర పల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు కనీసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయిందనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×