Thailand Gun Shooting: దక్షిణ థాయిలాండ్లో భయానక ఘటన చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం టాంబోన్ పటోంగ్ ప్రాంతంలోని ప్రథాన్ ఖిరివాట్ పాఠశాలలో ఓ దుండగుడు ఆకస్మికంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులను అతడు బందీలుగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో భయంతో పరుగులు తీస్తున్న ప్రజల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పాఠశాల ప్రాంగణాన్ని హాట్ యాయ్ పోలీసులు పూర్తిగా ముట్టడి చేసి భద్రతా చర్యలు చేపట్టారు.
నిందితుడు సుమారు 18 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి అని భావిస్తున్నారు. అతనితో చర్చలు జరిపి బందీలను సురక్షితంగా విడిపించేందుకు ప్రత్యేక దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోంది.
Also Read: కుక్కకు సర్జరీ.. ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చిన డాక్టర్, విశాఖలో అరుదైన ఘటన
థాయిలాండ్ లో ఘోరం
స్కూల్ లోకి చొరబడి విద్యార్థులు, టీచర్లను కాల్చి చంపిన దుండగులు
22 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు మృతి
Thailand massacre
Gunmen broke into a school and opened fire on students and teachers.
22 students and 12 teachers were killed. pic.twitter.com/kPvfbfSz6F
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2026