Robbery in Bengalore: బెంగళూరులోని మరాఠాహళ్లి పరిధిలో భారీ దొంగతనం. ఒక ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట, యజమానులు ఇంట్లో లేని సమయం చూసి సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నగర చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద గృహ చోరీగా పోలీసులు భావిస్తున్నారు. నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ నేరం స్థానిక నివాసితులను భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ ఘటన మరాఠాహళ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ నెల 25వ తేదీన బాధితులైన బిల్డర్ దంపతులు తమ బంధువుల ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన నిందితులు, ఇదే తమకు సరైన సమయమని భావించి పథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత పకడ్బందీగా లాకర్లను బద్దలు కొట్టి లోపల ఉన్న విలువైన సొత్తును దోచుకున్నారు.
అయితే దొంగిలించబడిన సొత్తు వివరాలు విస్తుగొలుపుతున్నాయి. నిందితులు దాదాపు 11.5 కిలోల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 18 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులను నేపాల్కు చెందిన దినేష్, కమల దంపతులుగా గుర్తించారు. వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానుల నమ్మకాన్ని చూరగొన్నారు. ఇంటి మూలమూలల గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: మొదలైన మేడారం మహా జాతర.. తొలిరోజు పోటెత్తిన భక్తులు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని (Police Verification), ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
రూ.18 కోట్ల విలువైన బంగారం, వెండి నగలతో ఉడాయించిన జంట
బెంగళూరులోని మరాఠాహళ్లి ప్రాంతంలో ఈ నెల 25న చోటు చేసుకున్న ఘటన
బంధువుల ఇంట్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరాఠాహళ్లి ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్ దంపతులు
ఇదే అదునుగా భావించి ఆ ఇంట్లో పని చేస్తున్న ఓ జంట.. లాకర్లు… pic.twitter.com/xZH7K9E7rp
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026