E-Paper
Advertisement

భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లింబాద్రిగుట్ట గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు అమాయక చిన్నారులు నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో పెను శోకం అలుముకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాలనీకి చెందిన హరీశ్‌ (11), అరవింద్‌ (10), వర్షిణి (6) అనే ముగ్గురు పిల్లలు ఆదివారం సరదాగా స్నానం చేద్దామని సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. అయితే, ఆ కుంట లోతును అంచనా వేయలేక, ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగిపోయారు.

పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కలిసి వెతకడం ప్రారంభించారు. నీటికుంట వద్ద వారి దుస్తులు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి నీటిలో వెతికారు. అప్పటికే ఊపిరాడక పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు

Related News

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి!

Punjab: ఆఫీసులో దారుణం.. మాజీ ప్రియురాల్ని 20 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, ఆపై తనకు తాను

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

Big Stories

×