Nizamabad: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లింబాద్రిగుట్ట గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు అమాయక చిన్నారులు నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో పెను శోకం అలుముకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాలనీకి చెందిన హరీశ్ (11), అరవింద్ (10), వర్షిణి (6) అనే ముగ్గురు పిల్లలు ఆదివారం సరదాగా స్నానం చేద్దామని సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. అయితే, ఆ కుంట లోతును అంచనా వేయలేక, ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగిపోయారు.
పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కలిసి వెతకడం ప్రారంభించారు. నీటికుంట వద్ద వారి దుస్తులు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి నీటిలో వెతికారు. అప్పటికే ఊపిరాడక పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు
నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిగుట్ట గ్రామంలోని వడ్డెర కాలనీలో విషాదం చోటుచేసుకుంది
ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందారు
స్థానికంగా నివసించే హరీశ్(11), వర్షిణి(6), అరవింద్(10) స్నానం చేసేందుకు నీటికుంట వద్దకు… pic.twitter.com/9opKXDnnvY
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2026