BigTV English

Three died in Road accident: ఘోరం.. ముగ్గురిని మింగేసిన రోడ్డు!

Three died in Road accident: ఘోరం.. ముగ్గురిని మింగేసిన రోడ్డు!

Three died in Road accident: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం.. నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:  పారిపోయిన ప్రేమజంట.. యువకుడి సోదరిపై యువతి బంధువులు సామూహిక అత్యాచారం!

ఇదిలా ఉంటే.. సిద్ధిపేట జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రాయపోలు మండలం గుర్రాల సోఫా కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్న కంకులను తరలిస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×