E-Paper
Advertisement

Husband Kills Wife: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. మోసానికి మూల్యం చెల్లించుకున్నావ్ అంటూ క్యాప్షన్..

Husband Kills Wife: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. మోసానికి మూల్యం చెల్లించుకున్నావ్ అంటూ క్యాప్షన్..

Husband Kills Wife: తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో గగుర్పాటు కలిగించే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం సాగిస్తోందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చుని పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండిపోయాడు. అంతకుమించి, భార్య శవంతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ ఘటనలో మరింత కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునల్వేలి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలమురగన్ అనే వ్యక్తికి, శ్రీప్రియతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా శ్రీప్రియకు ఇతర వ్యక్తితో సంబంధం ఉందని బాలమురగన్ తీవ్రంగా అనుమానించేవాడు. ఈ విషయంపై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు, చెబుతున్నారు. అనుమానంతో బాలమురగన్, భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని సమాచారం.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల తూటాలు కాస్తా చేతుల్లోకి వెళ్లడంతో కోపంతో బాలమురగన్ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని శ్రీప్రియపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ప్రాణాలు పోయే వరకు పలు మార్లు నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో శ్రీప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.

భార్య మృతి చెందిన తరువాత కూడా బాలమురగన్ అక్కడి నుంచి పరారవ్వలేదు. పోలీసులు వచ్చేంత వరకు ఆమె మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు. అంతేకాకుండా, తన మొబైల్ ఫోన్‌తో భార్య శవంతో సెల్ఫీ తీసుకుని, దానిని తన సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టాడు. వంచనకు మరణమే మూల్యం అంటూ క్యాప్షన్ జోడించి ఆ ఫోటోను పోస్ట్ చేయడం స్థానికంగా షాక్‌కు గురి చేసింది. కొద్దిసేపటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలమురగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు. ఘటన జరిగిన ఇంటి పరిసరాలను సీజ్ చేసి, ఆధారాలను సేకరిస్తున్నారు. బాలమురగన్‌పై హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 11 మంది మృతి

ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధంపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. బాలమురగన్ గత కొంతకాలంగా భార్యను అనుమానిస్తూ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలమురగన్‌ను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×