BigTV English

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Ananthapuram Road Accident: టమోటా లోడ్ లారీ దంపతుల పాలిట మృత్యు శకటం అయింది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భర్త మొండెం తెగిపడింది. భార్య కూడా అక్కడికక్కడే మరణించింది.


గుత్తి సమీపంలోని అప్పేదొడ్డికి చెందిన హనుమంతరెడ్డి, అతని భార్య ఒక పనిమీద బైక్ పై అనంతపురం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. టమాటా లోడ్ తో వచ్చిన లారీ బైక్ ను ఢీ కొట్టింది. దాంతో వారిద్దరూ స్పాట్ లో మృతి చెందారు. హనుమంతరెడ్డి తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటంతో.. స్థానికులు ఆ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×