Road Accident: జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బుద్గాంలోని పాలార్ ప్రాంతంలో టాటా సుమో డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగివున్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సు హైదరబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.