E-Paper
Advertisement

Bus Accident: నెల్లూరు హైవేపై ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 20 మంది

Bus Accident: నెల్లూరు హైవేపై ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 20 మంది

Bus Accident: మార్నింగ్ స్టార్ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్డవారి మిట్ట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇది బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండటంతో ఆరుగురికి తీవ్ర గాయాల పాలయ్యారు. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అసలు ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ అధిక వేగంతో వస్తూ ఒక లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ రోడ్డు వంపు వల్ల అదుపు తప్పాడు. దొడ్డవారి మిట్టకు సమీపంలో బస్సు రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడి పక్కకు తిరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు భయంతో కేకలు పిడుపు, బస్సు లోపల మహిళలు, పిల్లలు ఉండటంతో గందరగోళం నెలకొంది.

Also Read: ట్రంప్‌కు మోడీ ఫోన్ కాల్.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రమాదంలో ప్రయాణికులు అంతా గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగానే వెంటనే వారు సంఘటన స్థాలానికి చేరుకుని గాయపడిన వారిని ఉన్నత ఆసుపత్రులకు తరలించారు. గాయాలు పాలైన ఆరుగురిలో ఇద్దరు మహిళలు, ఒక పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరుగులేదు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×