BigTV English

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..
Advertisement

2 Killed 1 Injured in Tirupati Road Accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు-తిరుపతి హైవే రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీని వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.


కాగా, ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలవడంతో అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్సు గోయల్‌గా గుర్తించారు.

Also Read: పెదకాకానిలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి


బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ కారును అతివేగంగా నడిపి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Visakha Crime: విశాఖలో దారుణ హత్య.. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే చంపేశారు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి..

Uttarakhand News: అంతుచిక్కని వింత జ్వరం.. 10 మంది మృతి, భయం గుప్పిట్లో గ్రామాలు

Ghaziabad Crime: 11 ఏళ్ల కూతురి ముందు.. గన్ తీసుకుని భార్యని కాల్చిన భర్త, ఘజియాబాద్‌లో దారుణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Hyderabad: బైక్ పార్కింగ్ గొడవ.. 30 మందితో హాస్టల్ యువకులు ఇంట్లోకి చొరబడి..

Konaseema Crime: ఇద్దరు చిన్నారులను చంపిన తండ్రి.. ఆ తర్వాత ఏం చేశాడంటే, కోనసీమలో దారుణం

Anantapur Crime: వాడొక గజదొంగ.. 45 కేసుల్లో నిందితుడు, పోలీసుల్ని సస్పెండ్ చేయించాడు, ఎలా చిక్కాడు?

Big Stories

×