BigTV English
Advertisement

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Travel Bus Burnt: రాజస్థాన్‌లో ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బస్సుకు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జైపూర్-ఢిల్లీ నేషనల్ హైవే పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన ఎలా జరిగింది అన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం 

రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్లీపర్ బస్సు ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతానికి వెళ్తోంది. తోడి ప్రాంతంలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. టోల్ గేటు రుసుము తప్పించుకునేందుకు ఆ బస్సు విలేజ్ రోడ్డులో వెళ్లింది. దీనికితోడు స్లీపర్ బస్సు పైకప్పుపై భారీగా లగేజి ఉంది.


ఈ నేపథ్యంలో బస్సు లగేజీకి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పాట్‌లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  ఘటనతో బస్సులోని కార్మికులు భయాందోళనలు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ముగ్గురు మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. ఇంకొందరు బస్సులో నుంచి బయటకు దూకేశారు.

మంటల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు, ముగ్గురు మృతి

బస్సు ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.  మంటలను అదుపులోకి తెచ్చారు.  అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  తీవ్రంగా గాయపడిన ఐదుగురు కార్మికులను అధునాతన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

ALSO READ:  డిగ్రీ విద్యార్థిని యాసిడ్ దాడి కేసులో బాధితురాలి తండ్రి అరెస్ట్

ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించిన విషయం తెల్సిందే. ఈ ఘటన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్ ఏ మాత్రం మొద్దు నిద్ర వీడలేదు.

 

 

Related News

Acid Attack Case New Twist: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు, బాధితురాలి తండ్రి అరెస్ట్

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?

Gold Theft: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం.. భారీగా బంగారం, వెండి నగలు చోరీ

Big Stories

×