E-Paper
Advertisement

Telangana road accident: ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఇద్దరు మృతి, ఊడిన బస్సు టైర్

Telangana road accident: ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఇద్దరు మృతి, ఊడిన బస్సు టైర్

Telangana road accident: అతివేగం ఇద్దర్ని మింగేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కరీంనగర్- జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.

జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును, వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సంకీర్త్ తన పేరెంట్స్‌తో కలిసి జనగామకు పెళ్లి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారంతా జగిత్యాలకు చెందిన వారు. మృతి చెందిన యువతి సంకీర్త్‌కు బంధువు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

వాహనాలను పక్కకు తొలిగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గురైన జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుకు ముందు టైరు ఊడి పోయి ఉంది. టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా? లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఊడిపోయిందా అనేది తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×