E-Paper
Advertisement

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!
Advertisement

Jaipur Fake Jewellery Sale: ఈమె అమెరికాకు చెందిన మహిళ. సోషల్ మీడియా ద్వారా ఈ మహిళకు ఇండియాలోని రాజస్థాన్ కు చెందిన ఓ నగల వ్యాపారి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన అమెరికా మహిళ.. ఇండియాకు వచ్చి అతడి వద్ద ఉన్న నగలను కొన్నది. అందుకు రూ. 6 కోట్లు చెల్లించింది. వాటిని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో విక్రయానికి పెట్టింది. ఇక్కడ అసలు విషయం బయటపడింది. ఆ నగలు బంగారం పూతతో పూసి ఉన్న వెండి ఆభరణాలని తెలిసింది. వాటి విలువ రూ. 300 ఉంటుందని గుర్తించారు. తాను మోసపోయానని గుర్తించిన ఆ మహిళ నేరుగా మళ్లీ రాజస్థాన్ వ్యాపారి వద్దకు వచ్చి ప్రశ్నించింది. అదేంలేదంటూ పైగా ఆ మహిళనే బుకాయించాడు.

దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. దీంతో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..

Advertisement

అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ ఇండియాలోని జైపూర్ లోని జోహ్రీ బజార్ లో ఉన్న ఓ నగల వ్యాపారి నుంచి బంగారు పాలిష్ తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. వాటికి రూ. 6 కోట్ల నగదును చెల్లింది. ఏప్రిల్ లో యూఎస్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. బంగారం పూత పూసి ఉన్నటువంటి వెండి ఆభరణాలుగా గుర్తించారు. వాటి విలువ రూ. 300 మాత్రమేనని తెలిసి ఆ మహిళ షాక్ కు గురైంది. వెంటనే ఆమె ఇండియాకు చేరుకుంది. ఆ తరువాత రాజస్థాన్ లోని జైపూర్ కు వచ్చి తనకు నకిలీ ఆభరణాలను విక్రయించిన వ్యాపారిని నిలదీసింది.

Also Read: విషాదం.. ఒడిశా సీఎం పీఏ మృతి

Advertisement

దీంతో ఆ వ్యాపారి… అదేంలేదంటూ ఆమె ఆరోపణలను కొట్టిపారేస్తూ బుకాయించ సాగాడు. వెంటనే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. విషయం తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా పోలీసులను కోరారు.

2022లో సోషల్ మీడియా ద్వారా నగల వ్యాపారితో పరిచయం ఏర్పడిందని, గత రెండేళ్లుగా నగల కోసం రూ. 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది. ప్రస్తుతం ఆ నగల వ్యాపారి, తన తండ్రితో కలిసి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×