E-Paper
Advertisement

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

Jaipur Fake Jewellery Sale: ఈమె అమెరికాకు చెందిన మహిళ. సోషల్ మీడియా ద్వారా ఈ మహిళకు ఇండియాలోని రాజస్థాన్ కు చెందిన ఓ నగల వ్యాపారి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన అమెరికా మహిళ.. ఇండియాకు వచ్చి అతడి వద్ద ఉన్న నగలను కొన్నది. అందుకు రూ. 6 కోట్లు చెల్లించింది. వాటిని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో విక్రయానికి పెట్టింది. ఇక్కడ అసలు విషయం బయటపడింది. ఆ నగలు బంగారం పూతతో పూసి ఉన్న వెండి ఆభరణాలని తెలిసింది. వాటి విలువ రూ. 300 ఉంటుందని గుర్తించారు. తాను మోసపోయానని గుర్తించిన ఆ మహిళ నేరుగా మళ్లీ రాజస్థాన్ వ్యాపారి వద్దకు వచ్చి ప్రశ్నించింది. అదేంలేదంటూ పైగా ఆ మహిళనే బుకాయించాడు.

దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. దీంతో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..

అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ ఇండియాలోని జైపూర్ లోని జోహ్రీ బజార్ లో ఉన్న ఓ నగల వ్యాపారి నుంచి బంగారు పాలిష్ తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. వాటికి రూ. 6 కోట్ల నగదును చెల్లింది. ఏప్రిల్ లో యూఎస్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. బంగారం పూత పూసి ఉన్నటువంటి వెండి ఆభరణాలుగా గుర్తించారు. వాటి విలువ రూ. 300 మాత్రమేనని తెలిసి ఆ మహిళ షాక్ కు గురైంది. వెంటనే ఆమె ఇండియాకు చేరుకుంది. ఆ తరువాత రాజస్థాన్ లోని జైపూర్ కు వచ్చి తనకు నకిలీ ఆభరణాలను విక్రయించిన వ్యాపారిని నిలదీసింది.

Also Read: విషాదం.. ఒడిశా సీఎం పీఏ మృతి

దీంతో ఆ వ్యాపారి… అదేంలేదంటూ ఆమె ఆరోపణలను కొట్టిపారేస్తూ బుకాయించ సాగాడు. వెంటనే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. విషయం తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా పోలీసులను కోరారు.

2022లో సోషల్ మీడియా ద్వారా నగల వ్యాపారితో పరిచయం ఏర్పడిందని, గత రెండేళ్లుగా నగల కోసం రూ. 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది. ప్రస్తుతం ఆ నగల వ్యాపారి, తన తండ్రితో కలిసి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×