BigTV English
Advertisement

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : ట్రే తగిలిందని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వెయిటర్ పాత్రలు తీసుకువెళ్తుండగా ట్రే తగిలిందనే కారణంతో ఈ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల కాంట్రాక్టర్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర ఘజియాబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ వివాహానికి మనోజ్.. పంకజ్ ని వెయిటర్ గా తీసుకేవెళ్లాడు. అతడు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు తగిలింది. వారి మధ్య వివాదం జరిగింది.


దాంతో గొడవ ముదిరి పంకజ్ ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంకజ్ మరణించాడు. నిందితులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న అడవిలో పడేశారు. పంకజ్ తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×