Big Stories

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : ట్రే తగిలిందని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వెయిటర్ పాత్రలు తీసుకువెళ్తుండగా ట్రే తగిలిందనే కారణంతో ఈ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల కాంట్రాక్టర్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర ఘజియాబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ వివాహానికి మనోజ్.. పంకజ్ ని వెయిటర్ గా తీసుకేవెళ్లాడు. అతడు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు తగిలింది. వారి మధ్య వివాదం జరిగింది.

- Advertisement -

దాంతో గొడవ ముదిరి పంకజ్ ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంకజ్ మరణించాడు. నిందితులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న అడవిలో పడేశారు. పంకజ్ తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News