E-Paper
Advertisement

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : ట్రే తగిలిందని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వెయిటర్ పాత్రలు తీసుకువెళ్తుండగా ట్రే తగిలిందనే కారణంతో ఈ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల కాంట్రాక్టర్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర ఘజియాబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ వివాహానికి మనోజ్.. పంకజ్ ని వెయిటర్ గా తీసుకేవెళ్లాడు. అతడు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు తగిలింది. వారి మధ్య వివాదం జరిగింది.

దాంతో గొడవ ముదిరి పంకజ్ ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంకజ్ మరణించాడు. నిందితులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న అడవిలో పడేశారు. పంకజ్ తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×