E-Paper
Advertisement

గాజియాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

గాజియాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాపురంలోని ‘గౌర్ గ్రీన్’ (Gaur Green) అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు పక్కనే ఉన్న ఇతర ఫ్లాట్‌లకు కూడా వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.

ప్రమాద తీవ్రతను గమనించిన నివాసితులు ప్రాణభయంతో భవనం నుండి బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మూడు ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి ఫ్లాట్‌లలోని విలువైన సామాగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: గూగుల్ క్రెడిట్ జగన్‌దే.. చంద్రబాబుకు కేకే రాజు బహిరంగ సవాల్!

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×