E-Paper
Advertisement

Women Dies: దారుణం.. పిల్లలకు ఆడుకోమని చెప్పి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లి ఆత్మహత్య!

Women Dies: దారుణం.. పిల్లలకు ఆడుకోమని చెప్పి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లి ఆత్మహత్య!

తీవ్ర విషాదం.. పిల్లలకు ఆడుకోమని చెప్పి తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పహాడీ షరీఫ్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ వసంత(29)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వసంత భర్త లక్ష్మణ్ చనిపోగా.. అప్పటి నుంచి తల్లి, తమ్ముడితో ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది.

అయితే పాపం భర్త మరణాన్ని తట్టుకోలేక పోయిన వసంత నాలుగు సంవత్సరాలుగా తన భర్తను తలుచుకుంటూ కుంగిపోయింది. దీంతో ఆమె చనిపోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఆ తర్వాత నిన్న శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకుని ట్యాంక్ బండ్‌కు వచ్చింది. తన పిల్లలకు ఆడుకోమంటూ ఫోన్ ఇచ్చి ఇదే సరైన సమయం అనుకోని హుసైన్ సాగర్‌లో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Also Read: కర్మ రిటర్న్స్.. కేసీఆర్ యూ టర్న్స్

అక్కడే ఉన్న కొందరు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పిల్లల వద్ద ఉన్న మొబైల్ ద్వారా మృతురాలిని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆ తల్లి మరణం తర్వాత ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర శోకాన్ని మిగుల్చింది.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×