తీవ్ర విషాదం.. పిల్లలకు ఆడుకోమని చెప్పి తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పహాడీ షరీఫ్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ వసంత(29)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వసంత భర్త లక్ష్మణ్ చనిపోగా.. అప్పటి నుంచి తల్లి, తమ్ముడితో ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది.
అయితే పాపం భర్త మరణాన్ని తట్టుకోలేక పోయిన వసంత నాలుగు సంవత్సరాలుగా తన భర్తను తలుచుకుంటూ కుంగిపోయింది. దీంతో ఆమె చనిపోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఆ తర్వాత నిన్న శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకుని ట్యాంక్ బండ్కు వచ్చింది. తన పిల్లలకు ఆడుకోమంటూ ఫోన్ ఇచ్చి ఇదే సరైన సమయం అనుకోని హుసైన్ సాగర్లో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Also Read: కర్మ రిటర్న్స్.. కేసీఆర్ యూ టర్న్స్
అక్కడే ఉన్న కొందరు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పిల్లల వద్ద ఉన్న మొబైల్ ద్వారా మృతురాలిని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆ తల్లి మరణం తర్వాత ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర శోకాన్ని మిగుల్చింది.
ఆడుకోమని పిల్లలకు చెప్పి.. హుస్సేన్సాగర్లో దూకి తల్లి ఆత్మహత్య!
పహాడీషరీఫ్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ వసంత(29)కి ఇద్దరు కొడుకులు
నాలుగేళ్ల క్రితం కామెర్ల వ్యాధితో భర్త మృతి
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది చనిపోవాలని నిర్ణయం
పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని… pic.twitter.com/LjU4d7qQ86
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2026