Ask Nandi – Kashi: ఏఐ యుగంలోకి అడుగుపెట్టింది కాశీ విశ్వనాథుడి ఆలయం. టెక్నాలజీ వాడకంతో భక్తులకు అధునాతమైన దర్శన సౌకర్యాలు కల్పించడంలో కాశీ టెంపుల్ బోర్డు ముందడుగు వేసింది. అందుకోసం అస్క్ నందిని (Ask Nandi) పేరుతో ఏఐ చాట్ బాత్ను తీసుకొచ్చింది. అసలు ఈ ఏఐ చాట్బాత్ ఏం చేస్తుంది. దీని వల్ల భక్తులు కలిగే సౌకర్యాలు ఏంటి..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా కాశీ పట్టణానికి విశిష్టమైన స్థానం ఉంది. హిందువుల ఆరాధ్య దైవం పరమశివుడు అక్కడ కాశీ విశ్వనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులు వారణాసి పట్టణాన్ని సందర్శించి ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులు తీసుకుంటుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయంలో దర్శనం చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఇంకా సెలవు దినాల్లో అయితే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో ఆలయ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ బోర్డు ఏఐ ఆధారిత చాట్ బాత్ను ప్రారంభించింది. దీనికి అస్క్ నందిని (Ask Nandi) అని పేరు పెట్టింది. ఈ అస్క్ నందిని వల్ల ఉపయోగాలు ఏంటి..? ఇది ఎలా పని చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అస్క్ నందిని (‘Ask Nandi’) అనేది కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) చాట్బాట్. ఇది రోజూ ఆలయాన్ని సందర్శించే వేలాది భక్తులకు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.
దర్శన సమయాలు – ఉదయం, సాయంత్రం, ప్రత్యేక పర్వదినాల షెడ్యూల్, పూజలు & అభిషేకాలు – రుద్రాభిషేకం, మహా ఆర్తి, ప్రత్యేక పూజల వివరాలు, ఆన్లైన్ బుకింగ్స్ – పూజలు, దర్శనం టికెట్లు ఎలా బుక్ చేయాలి?, ఆలయ మార్గదర్శకం – గర్భగుడి, నంది మండపం, ప్రవేశ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలు, సాధారణ ప్రశ్నలు – దుస్తుల నియమాలు, నిషేధిత వస్తువులు, భక్తుల సౌకర్యాలు లాంటి అన్ని వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు.
ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులు ఇక నుంచి క్యూలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. భక్తులకు సమయం ఆదా అవుతుంది. కొత్తగా వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇంకా ఆలయ సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుంది.
అస్క్ నందిని (‘Ask Nandi’) కార్యక్రమం ద్వారా భక్తికి సాంకేతికత పెరగడంతో ప్రతి భక్తునికి సులభమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. అలాగే భారతదేశంలోని ఆలయాలు కూడా Digital India దిశగా సాగుతున్నాయన్న స్పష్టమైన సంకేతం ఇది ఇస్తుంది. ఈ కాశీ విశ్వనాథ ఆలయం తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో ఇతర ప్రధాన ఆలయాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది.