BigTV English

Ratha Saptami 2025: రథ సప్తమి విశిష్టత, పూజా విధానం.. పూర్తి వివరాలు

Ratha Saptami 2025: రథ సప్తమి విశిష్టత, పూజా విధానం.. పూర్తి వివరాలు

Ratha Saptami 2025: ఈ ఏడాది ఫిబ్రవరి 04న రథసప్తమి జరుపుకోనున్నాము. సూర్య భగవానుడు ఈ రోజున జన్మించాడని చెబుతారు. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, సూర్యుడిని ఆరాధించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఇది ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు ,దీర్ఘాయువును ఇస్తుందని చెబుతారు.


ఆరోగ్య రథ సప్తమిని ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. సప్తమి తిథి నాడు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడి చెబుతారు. సూర్య భగవానుడు ఈ రోజున తన కాంతితో ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపజేసాడని విశ్వాసం. అందుకే దీనిని రథ సప్తమి, సూర్య సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు.

మాఘమాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి ఫిబ్రవరి 04వ తేదీ ఉదయం 04:37 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 05వ తేదీ తెల్లవారుజామున 02:30 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకుంటారు.


రథ సప్తమి రోజు సూర్యుడిని ఎందుకు పూజించాలి:
గ్రంథాలలో సూర్యభగవానుడు సృష్టికి ఆధారం .అన్ని జీవులకు జీవాన్ని ఇచ్చేవాడుగా వర్ణించబడింది. అవి భూమికి కాంతి , శక్తిని అందించడమే కాకుండా వ్యక్తికి ఆరోగ్యం, తెలివి, ఆత్మవిశ్వాసం ,ఆధ్యాత్మిక పురోగతిని అందిస్తాయి. రథ సప్తమి రోజున సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా మనిషి రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు. ముఖ్యంగా చర్మవ్యాధులు, గుండె జబ్బులు, కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతారు.

రథసప్తమి రోజు ఉదయాన్నే స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా, పూర్వ జన్మల దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ రోజున చేసే ఉపవాసం, పూజలు ఏడు జన్మల పుణ్యఫలాలను అందిస్తాయి. ఎవరి జాతకంలో సూర్యుడు బలహీన స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తులు ఈ రోజున సూర్యభగవానుని ప్రత్యేకంగా పూజించాలని, తద్వారా వారి జాతక దోషాలు లేకుండా , జీవితంలో పురోగతి మార్గం సుగమమం అవుతుందని నమ్ముతారు.

పూజా విధానం:
రథ సప్తమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నువ్వులు, పచ్చి పాలు, గంగాజలం కలిపిన నీటితో పవిత్ర నదిలో, చెరువులో లేదా ఇంటిలో స్నానం చేయడం శుభప్రదమని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత, ఎరుపు రంగు దుస్తులు ధరించి, సూర్యుడి విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించి సూర్య భగవానుని పూజించాలి. పూజలో ఎర్రని పూలు, అక్షత, నువ్వులు, బెల్లం, చందనం సమర్పించాలి.

సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి రాగి పాత్రలో నీరు, బెల్లం, ఎర్రటి పువ్వులు, నువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు, “ఓం ఘృణీయా సూర్యాయ నమః” మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇది కాకుండా, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం విశేష ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉపవాసం ఉన్న వ్యక్తి పండ్లను తినాలి. అంతే కాకుండా రోజంతా సూర్య భగవానుడి మంత్రాలను జపించాలి.

Also Read: శని సంచారం.. ఏప్రిల్ నుండి వీరు పట్టిందల్లా బంగారం

సూర్యదేవుని కథ వినడం , దానం చేయడం కూడా ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు. బెల్లం, నువ్వులు, బియ్యం, ఎర్రని వస్త్రాలు, రాగి పాత్రలు , ఆవును దానం చేయడం ద్వారా మనిషికి ఆరోగ్యం, దీర్ఘాయువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున సూర్య భగవానుడికి ఖీర్ , బెల్లంతో చేసిన వస్తువులను సమర్పించడం చాలా ముఖ్యం. పూజ ముగిసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం , అవసరమైన వారికి ఆహారం , వస్త్రాలు దానం చేయడం చాలా పుణ్యం.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×