E-Paper
Advertisement

Maha Shivaratri Fasting: నిజమైన ఉపవాసం అంటే ఏంటి? చాగంటి కోటీశ్వరరావు గారి అద్భుత వివరణ

Maha Shivaratri Fasting: నిజమైన ఉపవాసం అంటే ఏంటి? చాగంటి కోటీశ్వరరావు గారి అద్భుత వివరణ
Advertisement

Maha Shivaratri Fasting: హిందూ ధర్మంలో ఉపవాసం, జాగరణ అనేవి కేవలం శారీరక క్రతువులు కావు, అవి ఆత్మాభివృద్ధికి తోడ్పడే సాధనాలు. చాగంటి కోటీశ్వరరావు గారి ప్రకారం.. ‘ఉపవాసం’ అంటే భగవంతుడికి సమీపంలో ఉండటం. ఆహారాన్ని మానేయడం కంటే మనస్సును దైవం వైపు మళ్లించడమే ముఖ్యం. అలాగే ‘జాగరణ’ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, అజ్ఞానమనే నిద్రను వీడి జ్ఞానమార్గంలో ప్రయాణించడం. శివరాత్రి పర్వదినాన ఈ రెండింటి ప్రాముఖ్యతను తెలుసుకుని ఆచరిస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ ఆధ్యాత్మిక విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ఉపవాసం, జాగరణ – చాగంటి గారి ఆధ్యాత్మిక ప్రవచనం:

Advertisement

మన సనాతన ధర్మంలో పండగలు అంటే కేవలం పిండివంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు. అందులో ఒక క్రమశిక్షణ, ఒక పరమార్థం దాగి ఉన్నాయి. ముఖ్యంగా శివరాత్రి వంటి పర్వదినాల్లో మనం పాటించే ‘ఉపవాసం’, ‘జాగరణ’ గురించి చాగంటి కోటీశ్వరరావు గారు ఎంతో అద్భుతంగా వివరించారు. ఆయన మాటల్లో వీటి అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.

ఉపవాసం అంటే ఏంటి?
సాధారణంగా ఉపవాసం అంటే రోజంతా ఏమీ తినకుండా ఉండటం అనుకుంటాం. కానీ చాగంటి గారి వివరణ ప్రకారం.. ‘ఉప’ అంటే సమీపంలో, ‘వాసం’ అంటే ఉండటం. అంటే భగవంతుడికి సమీపంలో నివసించడమే ఉపవాసం. మనం రోజూ తినే ఆహారం మన శరీరంలో రాజస, తామస గుణాలను పెంచుతుంది. ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. సోమరితనం పెరుగుతుంది. అప్పుడు మనస్సు భగవంతుడి మీద లగ్నం కాదు.

Advertisement

అందుకే.. ఉపవాసం రోజు ప్రతిరోజూ తిన్నట్టు కాకుండా.. చాలా పరిమితంగా ‘సాత్విక ఆహారం’ తీసుకోవాలి. శరీరం నీరస పడిపోతే మళ్ళీ మనస్సు దైవం మీద ఉండదు. కాబట్టి శరీరం సహకరించేంత మేర మాత్రమే ఆహారం తీసుకుంటూ.. మిగిలిన సమయమంతా దైవ చింతనలో గడపాలి. ఏమీ తినకుండా ఉండి, పనికిరాని లోకపు వార్తలు మాట్లాడుకుంటే అది ఉపవాసం అనిపించుకోదు. పూజలో ఆహార నియంత్రణ ఉంటేనే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి.

జాగరణ: తమోగుణాన్ని జయించే యుద్ధం:
సంవత్సరంలో ఒక్క ‘మహా శివరాత్రి’ రోజు మాత్రమే జాగరణ చేయాలని శాస్త్రం చెబుతోంది. చాగంటి గారి ప్రకారం.. నిద్ర అనేది తమోగుణానికి చిహ్నం. లోకమంతా నిద్రపోతున్నప్పుడు (అజ్ఞానంలో ఉన్నప్పుడు), మనం మాత్రం మేల్కొని ఉండటం అంటే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడమే. నిద్రపోకుండా ఉండటం అంటే కేవలం కళ్ళు తెరిచి ఉండటం కాదు, ఆ సమయంలో శివ నామస్మరణలో మునిగిపోవాలి.

తమోగుణాలకు లొంగకుండా ఉండటమే నిజమైన జాగరణ. శివరాత్రి రోజు రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మనలోని అంతర్గత శక్తులు ఉత్తేజితం అవుతాయి. ప్రాపంచిక విషయాలను మరిచిపోయి, పరమేశ్వరుడిలో ఐక్యం కావడానికి చేసే ప్రయత్నమే ఈ జాగరణ. అందుకే “జన్మకో శివరాత్రి” అంటారు. అంటే జీవితకాలంలో ఒక్క శివరాత్రినైనా చిత్తశుద్ధితో.. ఏకాగ్రతతో ఉపవాసం, జాగరణ చేస్తే అది ఆ జన్మను ధన్యం చేస్తుంది.

ఆచరించాల్సిన పద్ధతి:
చాగంటి వారు చెబుతున్నట్లుగా.. శివరాత్రి రోజు భౌతికమైన ఆకలిని, నిద్రను జయించడం ద్వారా మనం మానసిక విజయాన్ని సాధిస్తాం. ఉపవాసం మన శరీరాన్ని శుద్ధి చేస్తే.. జాగరణ మన మనస్సును జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. నిద్రను ఆపుకుని అప్రమత్తంగా ఉండటం అనేది ఒక సాధన. ఈ సాధన ద్వారా మనం దైవానికి మరింత దగ్గరవుతాం.

ఉపవాసం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు. ఆత్మను దైవంతో నింపుకోవడం. జాగరణ అంటే కళ్ళు తెరిచి ఉంచడం కాదు, మనోనేత్రాన్ని తెరవడం. ఈ శివరాత్రికి చాగంటి గారు చెప్పినట్లుగా సాత్విక ఆహారంతో.. నియంత్రిత నిద్రతో.. పరిపూర్ణమైన దైవ చింతనతో గడిపి శివానుగ్రహాన్ని పొందుదాం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×