E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవ – భక్తులకు మాత్రం నో ఎంట్రీ

Tirumala: తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవ – భక్తులకు మాత్రం నో ఎంట్రీ

Tirumala: తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవ జరుగుతుంది అయితే భక్తులకు మాత్రం ఈ సేవకు ఎంట్రీ ఉండదట. ఇంతకీ ఆ సేవ ఏంటి..? ఎప్పుడు జరుగుతుంది. భక్తులకు ఎందుకు ఎంట్రీ ఉండదు లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో రకాల సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆయా సేవలకు భక్తలను కూడా అనుమతిస్తుంటారు. అయితే తిరుమలలో స్వామి వారికి జరిగే ఒక సేవ మాత్రం చాలా గోప్యంగా జరుగుతుందట.  ఆ సేవకు భక్తులెవ్వరినీ అనుమతించరట. ఇంతకీ ఆ సేవ ఏంటో తెలుసా..? ఆ సేవకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా..? అదే కొలువు సేవ దీనినే దర్భార్‌ అని కూడా పిలుస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే అత్యంత విశిష్టమైన ఈ సేవకే భక్తులను అనుమతించరట.

కొలువు శ్రీనివాసమూర్తి:

​శ్రీవారి ఆలయంలో ఉన్న ఐదు విగ్రహ రూపాలలో (పంచబేరాలు) ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తికి (బలి బేరం) ఈ సేవను నిర్వహిస్తారు. ఈ మూర్తిని ఆలయ పరిపాలనాధికారిగా భావిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున సుమారు 4 గంటల 30 నిమిషాలకు తోమాల సేవ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. బంగారు వాకిలి లోపల ఉన్న స్నపన మండపంలో (తిరుమామణి మండపం) ఈ సేవ నిర్వహిస్తారు.

పూర్తిగా ఏకాంత సేవ:

ఇది పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఇందులో కేవలం అర్చకులు, ఆలయ అధికారులు మాత్రమే పాల్గొంటారు, భక్తులకు అనుమతి ఉండదు. ఈ సేవ ఒక రాజు తన కొలువులో కూర్చుని రాజ్య విశేషాలు తెలుసుకున్నట్లుగా సాగుతుంది. స్వామివారిని బంగారు గొడుగు కింద, వెండి సింహాసనంపై కూర్చోబెడతారు.  ఈ సమయంలో ఆలవట్టం (విసనకర్ర) విసురుతూ రాజోపచారాలు చేస్తారు.

స్వామి వారికి వివరాలు తెలియజేయడం:

ఆలయ ఆస్థాన సిద్ధాంతి ఆరోజు ఉన్న తిథి, వార, నక్షత్ర విశేషాలను, గ్రహ సంచారాన్ని స్వామివారికి వినిపిస్తారు. ​ఆదాయ నివేదన (బొక్కసం వివరాలు) క్రితం రోజున శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని (డబ్బు, బంగారం, వెండి నాణేల వివరాలు) అధికారులు స్వామివారికి చదివి వినిపిస్తారు.

తాండుల దాసం: ​

వేదాలను, ప్రబంధాలను పఠించిన అర్చకులకు బియ్యం, బెల్లం, తాంబూలం వంటివి దానంగా ఇస్తారు. దీనినే ‘తాండుల దానం’ అంటారు. ఈ సందర్భంగా  అర్చకులు స్వామివారిని “నిత్యైశ్వర్యోభవ” (ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతుడివై ఉండు) అని దీవిస్తారు.

స్వామికి నైవేద్యం: ​

ఈ సందర్భంగా స్వామి వారికి వేయించిన నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని (చిమ్మిలి) స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు అర్చకులు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఈ సృష్టికి అధిపతిగా భావిస్తారు. అందువల్ల ఆయన క్షేత్రంలో జరిగే ప్రతి పైసా ఖర్చు మరియు ఆదాయం ఆయన అనుమతితో, ఆయన సాక్షిగా జరగాలనే సంప్రదాయమే ఈ కొలువు సేవ

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మొదటి సారి తిరుమలలో అంగప్రదక్షిణకు వెళ్తున్నారా – కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×