BigTV English

Lord Shiva: శివుడికి పసుపు ఎందుకు రాయరు

Lord Shiva: శివుడికి పసుపు ఎందుకు రాయరు

Lord Shiva:శివుడి ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదని పురాణాలు చెబుతున్నాయి.అయితే శివుడిని భక్తితో పూజిస్తే వెంటనే ప్రసన్నుడు అవుతాడని అంటారు.అందుకే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. ఈ భూ ప్రపంచం మొత్తం శివమయం అంటారు. అయితే శివుడు అన్ని రకాల ఆడంబరాల నుండి దూరంగా ఉంటాడని నమ్ముతారు. అందుచేత శివారాధనలో గంజాయి, ఉమ్మెత్త, బిళ్వ పత్రం, , గంధపు ముద్ద, భస్మం, పచ్చి పాలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. శివుని పూజలో ఎటువంటి ఖరీదైన వస్తువులను ఉపయోగించరు.


పసుపును మాత్రం అస్సలు వాడకూడదు..శివారాధనలో పసుపును ఉపయోగించడం వల్ల శివునికి కోపం వస్తుంది. పూజ యొక్క పూర్తి ఫలం లభించదు. పసుపును సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ కారణంగా శివునికి పసుపు అంటే ఇష్టం ఉండదు. వాస్తవానికి పురాణ గ్రంధాలలో, శివలింగం శక్తికి చిహ్నం. ఇక పసుపు స్త్రీల అందాన్ని పెంచేందుకు వాడేది. అందువల్ల శివలింగంపై పసుపును సమర్పించడం నిషిద్ధమని నమ్ముతారు.

శివలింగంపై పసుపు వేయడం వల్ల వేడి పెరుగుతుందని నమ్ముతారు, అందుకే శివారాధనలో పసుపును అస్సలు వాడరు. .పసుపుతో పాటు, శివపూజలో ఇంకొన్ని ఇతర వస్తువులను ఉపయోగించడం కూడా నిషేధించారు. శివ పూజలో సింధూరం, తులసి ఆకులు కూడా ఉపయోగించకూడదు. సింధూరం శివుడికి సమర్పించ కూడదు. ఎందుకంటే సింధూరం స్త్రీల మాంగళ్యానికి చిహ్నం..వీటిని ఉపయోగించడం వల్ల శివుడికి కోపం పెరుగుతుంది..


Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×