E-Paper
Advertisement

Padma: చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. అవార్డుల్లో సంచలనాలు..

Padma: చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. అవార్డుల్లో సంచలనాలు..

Padma: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తాగే ORSను తయారు చేసిన దిలీప్ కి మరణానంతరం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషన్ వరించింది.

మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఆరుగురికి పద్మవిభూషన్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. ములాయం సింగ్ యాదవ్, ఎం.ఎస్.కృష్ణలకు పద్మవిభూషన్ ఇచ్చారు.

తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. చినజీయర్ స్వామికి, కమలేశ్ బి పటేల్(దాజీ)కి, గాయని వాణి జయరాం, సుదామూర్తిలకు పద్మభూషన్ పురస్కారం లభించింది.

తెలంగాణకు 2 పద్మశ్రీలు, ఏపీ నుంచి ఏడుగురికి పద్మశ్రీలు వచ్చాయి. సంగీత దర్శకులు కీరవాణికి పద్మశ్రీ పురష్కారం వరించింది.

ఏపీ నుంచి సంకురాత్రి చంద్రశేఖర్ కు.. తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి.. పద్మశ్రీ పురస్కారం లభించింది.

కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త, సంఘ సేవకులు. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ స్థాపించారు. సుమారు 3 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స అందించారు. శారదా విద్యాలయంలో వేలాది మందికి విద్యాదానం చేశారు. ఇలా, విద్య, వైద్య విభాగంలో ఎనలేని సేవ చేశారు.

చంద్రశేఖర్ రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో M.Sc. చేశారు. 1967లో కెనడాలో జీవశాస్త్రంలో పి.హెచ్.డి. చేసి.. కెనడా హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశారు. 1985 జూన్ 23న ఉగ్రవాదులు పేల్చివేసిన కనిష్క విమానంలో భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీ కిరణ్ లను పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటన తరువాత కాకినాడ వచ్చేసి.. కుమారుడి పేరుమీదుగా శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను ప్రారంభించి.. సంకురాత్రి ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గతంలో CNN హీరోగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. సంకురాత్రి చంద్రశేఖర్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తోంది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×