E-Paper
Advertisement

Shreyas Media: ‘విశాఖ ఉత్సవ్‍’ ఈవెంట్‍ లో లోపం.. శ్రేయాస్‍ మీడియా పై ఆరోపణలు..

Shreyas Media: ‘విశాఖ ఉత్సవ్‍’ ఈవెంట్‍ లో లోపం.. శ్రేయాస్‍ మీడియా పై ఆరోపణలు..

Shreyas Media: ఏపీ విశాఖ ఉత్సవ్‌ను నగరంలో ఈ నెల 24 నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఈవెంట్ కోసం రూ. 8 కోట్లను కేటాయించింది. ప్రముఖ మీడియా పార్ట్నర్ శ్రేయాస్ మీడియాకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మీడియాపై ఒకవైపు బ్యాడ్ రివ్యూస్ వినిపిస్తున్నా మరోవైపు ఎన్నో సినిమా ఈవెంట్‍ లు సకెస్సు ఫుల్‍ గా చేస్తూ చాలా పాపులర్ సంస్థ శ్రేయాస్‍ మీడియా.. దాంతో ఈ ఈవెంట్ కూడా భారీ సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ మీడియా సంస్థ ఓ వివాదంలో చిక్కుకుంది.. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మీడియా సంస్థ పై ఎటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

వివాదంలో శ్రేయాస్‍ మీడియా సంస్థ..

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల బాధ్యత శ్రేయాస్ మీడియాకు అప్పగించింది. ఈ ఉత్సవం ఇంకా మొదలవ్వకముందే ఈ మీడియా సంస్థపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘విశాఖ ఉత్సవ్’ ఏర్పాట్ల బాధ్యతలను ఏపీ పర్యాటక శాఖ శ్రేయాస్ మీడియాకు అప్పగించింది. Sea to Sky థీమ్‌తో 20 వేదికలపై 500కు పైగా కార్యక్రమాలు, 650 మంది కళాకారులతో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు చేసారు. అయితే ఈ ఈవెంట్ ప్రాంగణంలో స్టాలు నిర్వహణకోసం 30 నుంచి 70 వేల రూపాయలు వసూలు చేసిన శ్రేయాస్‍ మీడియా వారు స్టాలు ఏర్పాట్లలో సరైన వసతులు ఇవ్వలేదని స్టాలు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రేయాస్‍ మీడియా కేటాయింపు పై ఇప్పటికే ఆరోపణలు అనుమనాలు వినిపిస్తూన్న తరణం లోనే ఈవెంట్‍ నిర్వహణ లో వైపల్యం గురించి బాధితులు లబో దిబో అంటున్నారు. స్టాలు నిర్వాహకులు శ్రేయస్ మీడియా ప్రవర్తనపై మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. మరి దీనిపై శ్రేయాస్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి..

Also Read : ఆదివారం స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

విశాఖ ఉత్సవ్.. 

నిజానికి ఈ విశాఖ ఉత్సవ్‌ అంటే.. ఆ ప్రాంతంలోని యువత టాలెంట్ ను ప్రపంచానికి చూపించే ఒక గొప్ప వేదిక. గత ఏడాది జరిగిన ఉత్సవం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే, గతంలో విశాఖకు చెందిన ఈవెంట్‌ ఆర్గనేజైషన్లకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. లోకల్‌ కళాకారులు తమ ప్రతిభ కనబరిచేవారు. ప్రస్తుతం బడ సంస్థ శ్రేయస్ మీడియాకు ఏపీ ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.. ఎప్పటి మాదిరిగానే డిసెంబర్‌ నెలలో నిర్వహించాలన్న ఆలోచన కూడా చేసింది. కొన్ని అనుకోని కారణాలవల్ల అది జనవరి కి షిఫ్ట్ అయింది. ఈ కార్యక్రమం మొదలు అవ్వడంతో వివాదాలు తలెత్తడం తో జనాలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం గురించి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×