పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పదేళ్ల పాటు హిట్ లేకుండా ఉంటే.. గబ్బర్ సింగ్ రిలీజై ఫ్యాన్స్ బాధనంతా తీర్చేసింది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఆ మూవీ రిలీజై పదేళ్లు దాటేసింది. ఇప్పటి వరకు మళ్లీ ఆ కాంబోలో సినిమా రాలేదు. అయితే ఈ మధ్యన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వచ్చి పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీగా ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. మూవీని అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతుంది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సెట్స్ పైకి వెళ్లటం లేదు.
పవన్ ఇతర సినిమాలను పూర్తి చేయటంలో బిజీగా ఉండటం.. మరో వైపు రాజకీయాల్లోనూ తన వంతు పాత్రను పోషిస్తుండటంతో సినిమా స్టార్ట్ కావటం లేదు. మరో వైపు నెక్ట్స్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ సినిమా చేయాలంటే పవన్ ఎక్కువ రోజులను కేటాయించాలి. ఆయనకేమో కుదరటం లేదు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆపేశారట. పవన్ మరో సినిమా చేస్తానని నిర్మాతలకు చెప్పటంతో వారు కూడా ఓకే అన్నారని టాక్. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలపై దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.