Chiranjeevi Phone to Samantha : స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తుంది. అయితే మరోవైపు సమంత ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. ఎందుకంటే తమ అభిమాన తార మియోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో సమంతకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేశారని సినీ ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల టాక్. యశోద సినిమా సక్సెస్ గురించి చిరంజీవి.. సమంతను అభినందించారట. దాంతో పాటు సమంత హెల్త్ ఎలా ఉందని కూడా అడిగి తెలుసుకున్నారట. మియో సైటిస్ కారణంగా సమంత యశోద సినిమా ప్రమోషన్స్లో పాల్గొనలేకపోయింది. అప్పటికీ ఆమె ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత చెప్పిన సంగతి తెలిసిందే.
సమంత యశోద సినిమా పాజిటివ్ టాక్తో ప్రారంభమై క్రమంగా పుంజుకుంటుందని సినీ యూనిట్ సభ్యులు అంటున్నారు. సరోగసీ పేరుతో జరిగే క్రైమ్ అనే పాయింట్ను బేస్ చేసుకుని దర్శకులు హరి, హరీష్ కథను సిద్ధం చేసుకున్నారు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.