BigTV English

Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్

Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్

Leo 2 : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఆయన లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) తో తీసిన ‘లియో’ (Leo) మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? ఉంటే అది ఎప్పుడు తెరపైకి రాబోతోంది? అనే అనుమానాలు విజయ్ ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj).


కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్  “లియో”. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో అదరగొట్టింది. ఈ మూవీ టైంలోనే త్రిష వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా “లియో” మూవీకి సీక్వెల్ వుంటే బాగుంటుంది అని ఎప్పటినుంచో విజయ్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనగరాజ్ టీం కు పలు సందర్భాల్లో ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా మరోసారి ‘బ్లడీ బెగ్గర్’ (Bloody Beggar) అనే సినిమాను వీక్షించిన లోకేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘లియో’ (Leo) సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.

విజయ్ సినిమా ‘లియో’ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి రాబోతోంది ? అనే ప్రశ్న ఎదురు కాగా… లోకేష్ స్పందిస్తూ “విజయ్ అన్న అంగీకరిస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. కానీ నిజానికి విజయ్ ఇప్పుడు తాను చేస్తున్న సినిమా తర్వాత రాజకీయాలపైనే పూర్తిగా ఫోకస్ చేస్తానని, సినిమాలకు దూరమవుతానని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అభిమానుల కోరిక మేరకు ఆయన ఓవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు సినిమాలను చేస్తారా అనేది చూడాలి.


లోకేష్ కనగరాజ్ ఈ ప్రెస్ మీట్ లో తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కూలీ’ మూవీపై అప్డేట్ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండు షెడ్యూల్స్ లో పూర్తవుతుందని, ఆ తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు. లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ పేరుతో 2019లో రిలీజ్ అయిన ‘ఖైది’ సినిమాతో భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ ఎల్సీయూలో భాగంగానే విక్రమ్ (Vikram), లియో (Leo) వంటి సినిమాలను తెరికెక్కించారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న ‘కూలి’ మూవీ అందులో భాగం కాదని, అది పూర్తి అయిన వెంటనే ఎల్సీయూలోని హీరోలు అందరితోనూ ఒక మూవీ చేయబోతున్నానని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అలాగే ‘లియో 2’ మూవీకి ‘పార్తిబన్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వెల్లడించారు.  ప్రస్తుతం విజయ్ ‘దళపతి 69’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×