Big Stories

Tamannaah: విచారణకు రాలేను.. క్షమించండి

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇరుకున్న విషయం తెల్సిందే.  ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ లో అక్రమంగాలైవ్ లో చూపించినందుకు వయాకామ్ సంస్థ.. తమన్నాతో పాటు సంజయ్ దత్ మరియు ఇంకో ఇద్దరు ప్రముఖులకు నోటీసులు పంపింది.

- Advertisement -

తమ అనుమతి లేకుండా.. మ్యాచ్ లను ఆ యాప్ లో చూపించినందుకు తాము దాదాపు రూ. 100 కోట్లవరకు నష్టపోయినట్లు తెలిపింది. దీంతో తమన్నాను ఏప్రిల్ 29 న కోర్టు లో విచారణకు హాజరుపర్చాలని నోటీసులు కూడా వచ్చాయి. అయితే ఈ విచారణకు తాను హాజరు కాలేనని తమన్నా తన లాయర్ ద్వారా చెప్పించింది. షూటింగ్స్ కారణంగా ఏప్రిల్ 29 న తాను విచారణకు హాజరుకాలేనని, మరొక తేదీన ఖచ్చితంగా హాజరు అవుతానని తెలిపింది. దీంతో కోర్టు ఆమె విజ్ఞప్తిని సమ్మతించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

కేవలం తమన్నా ఈ కేసులో సాక్షిగానే ఉంది. సాక్షిలానే ఆమెను విచారణకు హజరు కానుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన బాక్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఓదెల 2 సెట్స్ మీద ఉంది. త్వరలోనే ఈ సినిమా ఉద రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాలతో తమన్నా ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News