BigTV English
Advertisement

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Nandamuri Balakrishna: నందమూరి తారక రామారావు.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్.. ఎప్పటికీ  మారని ఒక ట్రెండ్.. ఒక చరిత్ర.. తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు. అలాంటి మహనీయుడు లెగసీని కాపాడుకుంటూ వస్తున్నది నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ. నందమూరి వారసులు ఎంతమంది ఉన్నా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైనే చెప్పాలి. కానీ, ఎప్పుడు నందమూరి కుటుంబం తారక్ ను వారసుడుగా ఒప్పుకోలేదు. అందుకు కారణం.. తారక్.. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడమే.


నిజం చెప్పాలంటే హరికృష్ణ బతికి ఉన్నంతకాలం.. ఎన్టీఆర్ ను, కళ్యాణ్ రామ్ ను నందమూరి కుటుంబం సమానంగానే చూసుకున్నారు. హరికృష్ణ మారణానంతరం కళ్యాణ్ రామ్ కు, ఎన్టీఆర్ కు తండ్రిగా మారాడు బాబాయ్ బాలకృష్ణ. అయితే ఉన్నాకొద్దీ.. వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కారణాలు ఏమైనా కానీ, నందమూరి కుటుంబానికి, తారక్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.  నందమూరి బాలకృష్ణ ఎప్పుడు తారక్ ను వారసుడుగా గుర్తించడం లేదు అనేది అందరికి తెల్సిన విషయమే.

ఇక ఇవేమి పట్టించుకోని అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇప్పటికీ నందమూరి కుటుంబానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు నందమూరి వంశం గురించి మాట్లాడినా.. బాలయ్య, అన్న పిల్లల గురించి చెప్పకపోవడం గమనార్హం. తాజాగా మరోసారి బాలయ్య.. నందమూరి వారసులు ఎవరో తేల్చి చెప్పాడు. నిన్నటి నుంచి దుబాయ్ లో ఐఫా 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే.


గతేడాది బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడుగా అవార్డును అందుకున్నాడు. ఇక  బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య.. తన వారసుల గురించి మాట్లాడాడు. “గోల్డెన్ లెగసీ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్నగారి నుంచి వచ్చింది. అది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ అవార్డును ఆయనకే అంకితమిస్తాను” అని తెలిపాడు.

సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ.. మరి బాలకృష్ణ వారసులు ఎవరు.. ? అన్న ప్రశ్నకు బాలయ్య మాట్లాడుతూ.. ” నా కొడుకు మోక్షజ్ఞ.. నా మనవడు. ఇంకెవరున్నారు” అని టక్కున చెప్పాడు. ఆ ప్రశ్నకు బాలయ్య చెప్పిన సమాధానం కరెక్టే అయినా.. వారసులు అంటే.. ఎన్టీఆర్ కూడా వస్తాడు కదా.. అతని పేరును చెప్పకపోవడం కొద్దిగా బాధగా ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నందమూరి వారసుడుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మోక్షజ్ఞ ఎంతో కష్టపడి బరువు తగ్గి.. హీరో మెటీరియల్ గా మారాడు. ఇక ప్రశాంత్ వర్మ.. మోక్షును హీరోగా సానబెడుతూ.. మంచి అవుట్ ఫుట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నాడని టాక్. మరి ఈ సినిమాతో  నందమూరి నట వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×