E-Paper
Advertisement

Oscar Awards: ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు వీరే..

Oscar Awards: ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు వీరే..

Oscar Awards: ఆస్కార్.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి జీవిత ఆశయం. ఈ పురస్కారాన్ని పొందడం కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇక మార్చి 31న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత మంది భారీయులు ఈ అవార్డును అందుకున్నారో చూద్దాం..

భాను అథైమా.. భారత్ నుంచి మొట్టమొదటిసారి ఆస్కార్ అందుకున్న నటి. 1982లో వచ్చి గాంధీ సినిమాకిగానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకల్లో అవార్డును స్వీకరించారు. భారత్ నుంచి ఆస్కార్ అందుకున్న తొలి నటిగా భాను అథైమా చరిత్రలో నిలిచిపోయారు.

ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే ఈ అవార్డును అందుకున్నారు. ఇండస్ట్రీకీ ఆయన చేసిన సేవకు గానూ 1992లో ఆనరరీ అవార్డును అందుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోవడంతో.. నిర్వాహకులు ఆయన చికిత్స పొందుతున్న కోల్‌కత్తాలోని ఆసుపత్రికి వచ్చి అవార్డును అందజేశారు. ఆనరరీ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్ రే.

ఆ తర్వాత దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆస్కార్ పురస్కారాలు అందాయి. ఈ సారి ఏకంగా మూడు పురస్కారాలు వచ్చాయి. అది కూడా ఒకే సినిమా స్లమ్‌డాగ్ మిలీనియర్‌కి. బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఇలా మూడు విభాగాల్లో ఈ సినిమాకు మూడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోరో విభాగాల్లో సంగీతం దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ రెండు అవార్డులను అందుకున్నారు. బెస్ట్ సౌండింగ్ మిక్స్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సాధించాడు.

అలాగే 2019లో పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌ ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ పురస్కారం అందుకుంది. ఢిల్లీకి చెందిన నిర్మాత గునీత్ మోన్గా దీనిని నిర్మించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×