Big Stories

Kantara : ‘కాంతార’ విని ఎగ్జయిట్ అయిన పునీత్ రాజ్ కుమార్.. ఎందుకు నో చెప్పారంటే!

Kantara : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. విడుదలైన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. భారీ రేంజ్‌లో మూవీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను సినిమా సాధించింది. ఇంకా మంచి కలెక్షన్స్‌నే సాధిస్తోంది. ఈ సినిమా సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ కాంతార సినిమా కథను ముందుగా పునీత్ రాజ్ కుమార్‌కి చెప్పారట. ఆయన కూడా కథ విని ఎగ్జయిట్ అయ్యారు. కానీ అప్పటికే కమిట్ అయిన సినిమాలు వరుసలో ఉండటంతో కాంతార సినిమాను చేయలేదట. హీరో ఇంట్రడక్షన్ సీన్‌లో పునీత్ రాజ్ కుమార్ అయితే ఇంకా బాగా నటించేవాడని రిషబ్ శెట్టి అన్నారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు. గుండెపోటుతో అకాల మరణం చెందారు.

- Advertisement -

కాంతార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ నటించి ఉండుంటే మరింత బాగా ఉండేదని అప్పు అభిమానులు భావిస్తున్నారు. కె.జి.ఎఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన హోంబలే ఫిలింస్ ఇప్పుడు కాంతారతో మరో బ్లాక్ బస్టర్‌ను అందించింది. భూత కోల, కర్ణాటకలోని సంస్కృతి సంప్రదాయాలను ఈ చిత్రంలో చూపించారు. తెలుగులోనే కాంతార చిత్రం యాబై కోట్ల రూపాయల వసూళ్లను ఈ చిత్రం సాధించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News