Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్కి చాలా నష్టాలే వచ్చాయి. వారందరికీ సెటిల్ చేసి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ ఫెయిల్యూర్ని మాత్రం ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ మధ్య ఓ వేదికపై కొరటాల ఇన్ డైరెక్టర్గా ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. తాజాగా ఇప్పుడు ఆచార్య విషయంలోనే రామ్ చరణ్ కూడా విమర్శల పాలయ్యాడు. ఎందుకంటే రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న చెర్రీ.. సినిమాల్లో మారుతున్న ట్రెండ్ గురించి మాట్లాడారు.
ప్రస్తుతం ప్రేక్షకుల కొత్త తరహా కథలను ఆస్వాదిస్తున్నారని, ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తాను ఓ సినిమాలో గెస్ట్ చేయగా.. అది సరిగ్గా లేకపోవటంతో సరిగ్గా ఆడలేదని కామెంట్స్ చేశారు. అంటే RRR తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా ఆచార్య. ఆ సినిమాలో చరణ్ కీలక పాత్ర. తన పాత్రను బేస్ చేసుకునే ప్రధాన కథ నడుస్తుంది. అలాంటి పాత్రను గెస్ట్ రోల్ అనటం.. ఫెయిల్యూర్ను స్వీకరించలేక దాన్ని కొరటాల శివకే కట్టబెట్టాలనే ప్రయత్నం చేయటం అనేవి అందరినీ ఆశ్చర్యపరిచాయి. నెటిజన్స్ చరణ్ తీరుని తప్పుపడుతున్నారు.