E-Paper
Advertisement

Savitri: సావిత్రికి అంత డిమాండ్ ఉండేదా.. జమున మాటల్లో విస్తుపోయే నిజాలు..!

Savitri: సావిత్రికి అంత డిమాండ్ ఉండేదా.. జమున మాటల్లో విస్తుపోయే నిజాలు..!
Advertisement

Savitri.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్లకు పర్ఫెక్ట్ జోడీగా నిలిచిన ఏకైక హీరోయిన్ సావిత్రి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన ఈమె మంచితనానికి మారుపేరు. అలాంటి సావిత్రి క్రేజ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మహానటి గొప్పదనం ఎట్టిదంటే..
మహానటి సావిత్రి జీవితం ఒక తెరిచిన పుస్తకం అని అందరికీ తెలుసు..ఆమె సినిమా జీవితమే కాదు వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆమె బయోపిక్ వచ్చిన తర్వాత.. సావిత్రి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు నాటితరం, నేటితరం ఇలా అన్ని తరాలకి ఈమె ఒక ఆదర్శం అనే చెప్పాలి. తెలుగు వారు మాత్రమే కాకుండా తమిళనాట కూడా ప్రేమించి, ఆరాధించే హీరోయిన్ సావిత్రి. ఈమె వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. ముఖ్యంగా వైవాహిక జీవితం ఈమెను అతలాకుతలం చేసినా , సినిమా ఇండస్ట్రీ మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకుందని చెప్పవచ్చు.

Advertisement

విపత్తునిధి కోసం ఒంటిమీద నగలు ధారపోసిన సావిత్రి..

మహానటి సావిత్రి మంచి మనసున్న గొప్ప వ్యక్తి. ఎంతోమంది పాలిట దేవత. అయితే చివరి క్షణంలో మాత్రం ఎవరూ కూడా ఈమె పై కృతజ్ఞత చూపించలేకపోయారు. ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన సావిత్రి ని..వారంతా మోసం చేయడం ఇంతకంటే దారుణం మరొకటి లేదేమో. ఒకసారి 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న నగలు అన్నింటిని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రికి ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది. అయితే ఇదంతా విపత్తు నిధి కోసం ఈమె అందించిందని చెప్పవచ్చు.. తనతో పాటు తన కూతురు ఒంటిపై ఉన్న నగలు కూడా తీసి ఇచ్చారు సావిత్రి.

Advertisement

సావిత్రి వేసుకున్న మాల వేలం వేస్తే రూ.30 వేలు ధర..

ఇదిలా ఉండగా సావిత్రి కి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో మరో హీరోయిన్ జమున గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఒక సందర్భంలో ప్రభుత్వం విపత్తు నిధికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు అప్పుడు పనిచేశారు. అయితే ఆ సమయంలో సినిమా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు . దీంతో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు సావిత్రి కోసం వేసిన పూలదండను వేలానికి పెడితే, అప్పట్లోనే రూ .30 వేలకు పైగా ధర పలికిందట. అయితే ఈ రూ.30 వేల విలువ అప్పట్లో రూ .30 లక్షలకు పైగానే అనుకోవచ్చేమో.. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కూడా. ఈమె క్రేజ్ అంతలా ఉండేది మరి.

30 ఏళ్ల కెరియర్ లో 252 చిత్రాలు..

అంతే కాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే విషయంలో కూడా వేలకు వేల రూపాయలు అలా తీసి ఇచ్చేసారట సావిత్రి. ఇకపోతే కెరీర్ లో 30 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె..ఏకంగా 252 చిత్రాలలో నటించింది. ఇలా ఎంతో ఉన్నతంగా బ్రతికిన సావిత్రి చివరి రోజులలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మత్తుకు బానిస అయ్యి, 1981 డిసెంబర్ 26న కోమాలోకి వెళ్లి కొన్నేళ్లు కోమలోనే ఉండిపోయిన సావిత్రి ఆ తర్వాత స్వర్గస్తురాలు అయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×