E-Paper
Advertisement

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?
Advertisement

Soundarya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మహానటి సావిత్రి తర్వాత దొరికిన ఏకైక ఆణిముత్యం సౌందర్య (Soundarya )అని చెప్పడంలో సందేహం లేదు. హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈమె గ్లామర్ ప్రపంచంలో కూడా గ్లామర్ వలకబోయకుండానే తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవిని మొదలుకొని వెంకటేష్, నాగార్జున ఇలా ఎంతోమంది హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ. నేడు మన మధ్య లేకపోయినా ఆమె చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

కర్ణాటకలో పుట్టి ఆంధ్రాలో గుర్తింపు..

Advertisement

కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య ఎంత అందంగా ఉంటుందో ఆమె నటన అంతకుమించి అందంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఉమెన్ పాత్రలతో భారీగా మెప్పించిన దశాబ్ద కాలం పాటు తెలుగు ఆడియన్స్ ను అలరించింది. పుట్టింది కర్ణాటక అయినా ..పేరు తెచ్చుకుంది మాత్రం తెలుగమ్మాయిగా.. ఇక్కడ ఆడియన్స్ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె తండ్రి సత్యనారాయణ అయ్యర్.. కన్నడలో నిర్మాతగా, రైటర్ గా కూడా రాణించారు. పలు సినిమాలను ఆయన నిర్మించారు కూడా.. తండ్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చిన ఈమె.. ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం ఒక అమ్మాయి కావాలంటే తన కూతురు ఉంది కదా అని సౌందర్యను స్కూల్ నుంచి సెట్ కి తీసుకెళ్లారట. ఆ సమయానికి అసలు సౌందర్యకు సినిమా అంటేనే ఇష్టం లేదు. మొదట్లో తన ఇష్టాన్ని తన తండ్రి గౌరవించలేదని తన తండ్రితో మాట్లాడమే మానేసిన ఈమె.. ఆ తర్వాత వేరే ప్రత్యామ్నాయం లేక నటిగా మారాల్సి వచ్చింది.

తండ్రి మరణం కృంగదీసింది..

Advertisement

అసలు ప్రయారిటీనే లేని పాత్రలో నటించిన ఈమె.. ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో చదువు కూడా పక్కనపెట్టి సినిమాల్లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చదువును పూర్తిగా వదిలేసింది కూడా.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడంతోనే కెరియర్ పూర్తిగా మారిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్ళింది. అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే తండ్రి మరణించాడు. ఈ క్రమంలోనే తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్న ఈమె నిర్మాతగా మారింది. నాన్న పేరుతోనే బ్యానర్ ని కూడా లాంచ్ చేసింది.

నిర్మాతగా మారిన సౌందర్య.

సత్యం మూవీ మేకర్స్ పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, 2002లో ద్వీప అనే సినిమాను కన్నడలో తెరకెక్కించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కించారు. ఇందులో సౌందర్య లీడ్ రోల్ పోషించారు. పేదల జీవితాలను ఆవిష్కరించే కథాంశంతో వచ్చిన ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ పర్వాలేదు అనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలా నిర్మాతగా మారి తండ్రికి ట్రిబ్యూట్ ఇచ్చింది. అంతేకాదు ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె నిర్మాతగా పనిచేయలేదు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×