Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 తో భారీ విజయాన్ని అందుకున్నాడు. గతంలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 వచ్చింది. వివాదాల నడుమ భారీ విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. అయితే ఆ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో మూవీ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ ను ఓ బడా నిర్మాత వదిలేసాడు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పుష్ప 2 హిట్.. తెలుగులో పెరగని ఇమేజ్..
టాలీవుడ్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా లెవెల్లో పాగా వేసిన అతి కొద్ది మంది హీరోస్ లో ఇపుడు తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా చేసిన ఎన్నో సినిమాల్లో ఫైనల్ గా పుష్ప సినిమాలతో ఆయన క్రేజ్ పెరిగింది. అయితే ఇక నెక్స్ట్ తన సినిమాలపై భారీ హైప్ లే ఉంటాయి అన్నీ వెయ్యి కోట్లు సినిమాలు రికార్డు బడ్జెట్ లు అల్లు అర్జున్ పై వస్తాయి అని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఇపుడు అల్లు అర్జున్ మార్కెట్ పై ఇంకా పలు సందేహాలు కొనసాగుతున్నాయట.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నిని పాన్ ఇండియా స్టార్ అని ఎవ్వరు అనుకోవడం లేదు. నార్త్, మాలీవుడ్ లో మాత్రమే అల్లు మేనియా కొనసాగుతుంది. అందుకే ఇక డైరెక్ట్ గా అక్కడే సినిమాలను ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ..
Also Read : సుమ ఇంటిని ఏ సినిమా షూటింగ్ లకు ఇచ్చారో తెలుసా..?
బన్నీకి హ్యాండ్ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్..
అల్లు అర్జున్ ప్రస్తుతంతమిళ దర్శకుడు అట్లీతో ఓ భారీ సినిమా తాను చేయనున్నట్టుగా పుకార్లు చాలా జోరుగానే కొనసాగుతున్నాయి. కాగా ఈ కాంబినేషన్ పైనే ఓ ఊహించని టాక్ ఇపుడు వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమాని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చేయాలి అనుకున్నారని టాక్.. అయితే ఇప్పుడు అది తప్పుకుందట. బడ్జెట్ విషయంలో వెనక్కి వెళ్లిపోయారట. అల్లు అర్జున్ మార్కెట్ పై వారికి నమ్మకం లేకనే అని పలు కామెంట్స్ ఇపుడు మొదలయ్యాయి. మెయిన్ గా వారు రిస్క్ తీసుకోదలచుకోలేదు అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా యావరేజ్ టాక్ ను అందుకొనే అవకాశాలు ఉన్నాయి. అందుకే బన్నీ విషయంలో రిస్క్ తీసుకొనే ఆలోచనలో నిర్మాతలు లేక పోవడం తో తప్పుకున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట మాత్రం దుమారం రేపుతుంది. సన్ పిక్చర్స్ వారు తప్పుకునేసరికి ఈ సినిమాని తెలుగు టాప్ ప్రొడ్యూసర్ ఒకరు టేక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..