Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్దు నటించిన కొత్త సినిమా ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్ హీరోయిన్గా నటించింది. ఇవాళ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్లో రాధిక అనే అమ్మాయి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మోసపోయిన హీరో టిల్లుకి.. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మరో అమ్మాయి వల్ల మరిన్ని సమస్యలు ఎదురుకావడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఫస్ట్ పార్ట్ ‘డీజే టిల్లు’ మంచి హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ ‘టిల్లు స్క్వేర్’పై మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అదీగాక పోస్టర్లు, టీజర్, సాంగ్తో ఓ లెవెల్లో అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా ట్రైలర్తో ఫుల్గా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. దీంతో ఇవాళ థియేటర్లకు పరుగులు పెట్టిన ప్రేక్షకాభిమానులకు ఈ మూవీ తెగ నచ్చేసింది.
ఏ సినిమాలోనూ చూపించని ఎక్స్పోజింగ్ను అనుపమ ఈ మూవీలో ఆరబోసేసింది. దీంతో ప్రీమియర్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. ఇక ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్తో థియేటర్ దద్దరిల్లిపోతుంది. టిల్లన్న ఈ సారి డీజే మరింత గట్టింగా మోగించాడని ప్రేక్షకాభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: ఇప్పటికైనా ఓటు వేయండి.. లేదంటే చచ్చిపోండి.. నారా రోహిత్ ‘ప్రతినిధి2’ టీజర్..
అంతేకాకుండా సిద్దు ఈ మూవీ కోసం ప్రాణం పెట్టాడని అంటున్నారు. ఇందులో తన యాక్టింగ్ ఇరగదీసేశాడని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రామ్ మిర్యాల సాంగ్స్ మరో లెవెల్కి తీసుకెళ్లాయని చెబుతున్నారు. ఇక థియేటర్లలో దుమ్ము దులిపేస్తున్న ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అవుతుందో తెలిసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా మూవీ నిర్మాతలు, నెట్ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ అయిన నెల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందని సినీ వర్గాల సమచారం.
Also Read: విశ్వక్సేన్ బర్త్ డే స్పెషల్.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..
అంటే మార్చి 29న విడుదల అయిన ఈ సినిమా ఏప్రిల్ చివర్లో కానీ, లేదా మే ఫస్ట్ వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రిన్స్ సెసిల్, ప్రణీత్ రెడ్డి కల్లెం, మురళీధర్ గౌడ్, కీలక పాత్రలలో నటించగా.. అతిధి పాత్రలో నేహా శెట్టి నటించి సర్ప్రైజ్ చేసింది.